Monday, May 6, 2024

బ్యాలెట్, ఈవిఎంల నుంచి చిహ్నాలను తొలగించాలన్న పిటిషన్ తిరస్కృతి

- Advertisement -
- Advertisement -

supreme court

న్యూఢిల్లీ:   బ్యాలెట్, ఈవీఎంల నుంచి చిహ్నాలను తొలగించి, వాటి స్థానంలో అభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హత, ఫోటోగ్రాఫ్ ఉండేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, రాజకీయాల్లో అవినీతి, నేర కార్యకలాపాలను నిరోధించడానికి ఈవీఎంలలో పార్టీ గుర్తును ఉపయోగించడం చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆదేశించాలని కోరారు. బ్యాలెట్‌, ఈవీఎంలపై రాజకీయ పార్టీల చిహ్నాలను మార్చి, అభ్యర్థుల వివరాలు ఇవ్వడం  వల్ల నిజాయితీపరులైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటర్లకు దోహదపడినట్లు కాగలదని  పిటిషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News