Tuesday, April 30, 2024

సీతంపేట బ్రిడ్జ్, రోడ్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వనమా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ సుజాతగనర్‌: మండలంలోని సీతంపేట గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే వనమాకు ఫిర్యాధు చేశారు. శుక్రవారం ఆయన బ్రిడ్జ్ పనులను, రోడ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ ఈఈ, డిఈలు, కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ చేస్తున్న తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాంట్రాక్టర్‌ను వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News