Tuesday, May 14, 2024

వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించిన నటుడు షారూఖ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

జమ్ము: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చాలా కాలానికి తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన సినిమా ‘పఠాన్’ 2023 జనవరిలో విడుదల కాబోతున్నది. ఇదిలావుండగా ఆయన ఇటీవల జమ్ములోని వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించుకున్నారు. అది ఇప్పుడు ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. జనం మధ్య ఆయన నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుందా వీడియోలో. ఆయన చుట్టూ అంగరక్షకులు కూడా ఉన్నారు. ఆయన డిసెంబర్ 11 రాత్రి వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే షారూఖ్ ఖాన్ కొంత కాలం కిందట సౌదీ అరేబియాకు వెళ్లి ‘ఉమ్రా’ కూడా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News