Tuesday, April 30, 2024

హీరోయిన్ రకుల్‏కు ఈడీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. గతంలో రకుల్ ఈడీ విచారణకు హాజరైన ముచ్చట తెలిసిందే. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని గతంలో విచారణ మధ్యలోనే వెళ్లిపోయింది రకుల్. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 3తేదీన రకుల్ ప్రీత్ ను ఈడీ అధికారులు విచారించారు. అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈడీ పలువురిని ప్రశ్నించింది. ఎక్సైజ్ అధికారులు 2017 జులైలో ఎన్డీపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు నటులు, దర్శకుడిని అధికారులు ప్రశ్నించారు. 2021 సెప్టెంబర్ లో మనీలాండరింగ్ కింద టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ దర్యాప్తు చేసి 12 మందికి నోటీసులు జారీ చేసింది. పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్, పబ్ మేనేజర్, రవితేజ డ్రైవర్ శ్రీనివాసులను ఈడీ విచారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News