Tuesday, May 14, 2024

నవజాత శిశువు మార్పిడి కలకలం..

- Advertisement -
- Advertisement -

 

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మార్పిడి కలకలం. చెన్నూర్ కు చెందిన గర్భిణీ కుటుంబీకులకు అప్పుడే పుట్టిన మగ శిశువు అప్పగించి కాసేపటికి ఆసుపత్రి సిబ్బంది ఆడబిడ్డ అని తెలిపారని ఆసుపత్రిలో గర్భణి కుటుంబ సభ్యలు ఆందోళన చేపట్టారు. ఒకే రోజు ఇద్దరు గర్భిణిలు ప్రసవం కావడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం వల్ల శిశువు మార్పిడి చెందిందని గర్భణీ కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఆసుపత్రి సూపర్డెంట్ ఇద్దరి శిశువులను శిశు సంక్షేమ శాఖకు అప్పగించి DNA నిర్ధారణ పరీక్ష అనంతరం అప్పగిస్తామని వారికి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News