Tuesday, April 30, 2024

మార్కెట్లోకి ఎథర్ స్టాక్ 5.0

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యుత్ స్కూటర్ తయారీదారు ఎథర్ ఎనర్జీ కొత్త సంవత్సరంలో ఎథర్ కమ్యూనిటీ డే రోజు ప్రకటించడం ద్వారా వైభవంగా ప్రారంభించింది. ఎథర్ ఈ కార్యక్రమంలో ఎథర్ స్టాక్ 5.0 ను విడుదల చేసింది. తమ వాహనాలను ముందుకు నడిపించే సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌కు అతి పెద్ద అప్‌గ్రేడ్ ఇది.

ఎథర్ స్టాక్ 5.0 లో పూర్తి సరికొత్త యుఐ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ కోసం ఇది అందుబాటులో ఉండటంతో పాటుగా గుగూల్ శక్తితో వెక్టార్ మ్యాప్స్‌ను సైతం విడుదల చేసింది. ఈ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు ఎంచుకునేందుకు నాలుగు నూతన రంగులను పరిచయం చేసింది. నూతన ఎథర్ స్టాక్ విడుదల గురించి ఎథర్ ఎనర్జీ కో-ఫౌండర్, సిఇఒ – తరుణ్ మెహతా మాట్లాడుతూ, 2018లో ఎథర్ స్టాక్‌ను ఎథర్ 450లో విడుదల చేశామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News