Tuesday, April 30, 2024

విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ డ్యాన్స్.. ప్రేక్షకులు కుష్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై టీమ్ ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకపై 2-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచులో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, మ్యాచ్ తర్వాత డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇద్దరు ఆటగాళ్లు డ్యాన్స్ చూసిన అభిమానులు ఫుల్ కుష్ అయిపోయారు. కోహ్లీ, ఇషాన్ కిషన్ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News