Tuesday, May 14, 2024

కారు ఢీకొని ఐఐటి ఢిల్లీ పిహెచ్‌డి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఐఐటి ఢిల్లీలో పిహెచ్‌డి చేస్తున్న ఒక విద్యార్థి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. విద్యా సంస్థ ఎదురుగా ఉన్న ఎస్‌డిఎ మార్కెట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఐఐటి ఢిల్లీలో పిహెచ్‌డి చేస్తున్న అష్రఫ్ ఖాన్ అనే విద్యార్థి మరణించగా అంకుర్ శుక్లా అనే మరో విద్యార్థి గాయపడ్డాడు. వీరిని ఢీకొన్న అనంతరం కారుతో సహా డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ను గుర్తించామని, ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే కారును వదిలిపెట్టి డ్రైవర్ పరరాయ్యాడని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News