Monday, May 13, 2024

అన్నాసాగర్ గ్రామ సర్పంచ్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామసర్పంచ్ సస్పెండ్ అయ్యాడు. సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ శనివారం సస్పెండ్ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెండ్ చేసినట్లు సమాచారం. రూ.14 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News