Thursday, May 2, 2024

చిన్నారితో సహా వృద్దురాలు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  మెదక్‌ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆరేళ్ల చిన్నారితో పాటు వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. చేగుంట మండలం చిన్న శివునూరులో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. మంటల్లో 60 సంవత్సరాల వృద్ధురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది, మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News