Tuesday, April 30, 2024

చెన్నైలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు-ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డిఎంకె ఎంపి తిరుచి శివ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడనున్నారు.

బిఆర్‌ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సిఎం కెసిఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవిత చాటిచెప్పనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ఆమె ప్రసంగించనున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News