Saturday, September 21, 2024

విమర్శలను సహించలేని మోడీ సర్కార్

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: బిబిసికి చెందిన న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ(ఐటి) దాడులను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం ఖండించారు. విమర్శలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించబోదని చెప్పడానికి ఈ దాడులే స్పష్టమైన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండును కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిచండాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్షాల గొంతును ఓపికగా వినడానికి ఇది వాజపేయి పాలన కాదని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News