Thursday, May 9, 2024

మైనర్ బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్‌ఆర్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం తెలిపిన వివరాల ప్రకారం వైఎస్‌ఆర్‌నగర్‌లో నివాసం ఉండే కొనుసోతే సోని,మురళి భార్య భర్తలు. వీరికి బాబుతో పాటు 8వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలిక కలదు. రోజు మాదిరిగానే కూతురు పాఠశాలకు వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లుతుండేవారు. ఈ నెల 18వ తేదిన కూతురు పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులు పనికి వెళ్లారు.

తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి కూతురు కనబడలేదు.చుట్టు పక్కల వారిని విచారించగా పాఠశాల నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కూతురు స్కూల్ బ్యాగ్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లినట్లుగా తెలిసింది.కూతురు ఆచూకి కోసం చుట్టు పక్కల వెతికిన ఆచూకి లభ్యం కాకపోవడంతో ఆదివారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News