Tuesday, May 14, 2024

ఏసీబీకి చిక్కిన పంచాయతి కార్యదర్శి..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లాలో ఓ అవినీతి పంచాయతి కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో సర్పంచ్ భర్త నుండి గ్రామంలో రోడ్డు బిల్లు కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిని ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News