Sunday, May 19, 2024

ఐఐటి పిహెచ్‌డి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు లోని వేలాచేరి లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్‌లో చదువుతున్న పీహెచ్‌డి విద్యార్థి సచిన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమబెంగాల్ వాసి అని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‌లో ఆత్మహత్యా ఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కాగా, 2018 నుంచి 11 ఘటనలు జరిగాయి.

పోలీస్‌ల సమాచారం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన సచిన్ మార్చి 31న “ఐయామ్ సారీ .. అంత మంచిగా ఏమీ లేదు” అంటూ వాట్సాప్ స్టాటస్ పోస్ట్ చేశాడు. దీంతో మిత్రులు అతని ఇంటికి చేరుకునే సరికి గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం రాయపేట లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి , దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News