Tuesday, April 30, 2024

Sub Inspector: జనగామలో భార్య ఆత్మహత్య… ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని

- Advertisement -
- Advertisement -

వరంగల్: జనగామలో ఎస్‌ఐ శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతుల మధ్య గొడవ జరగడంతో ఎస్‌ఐ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మనస్థాపంతో స్నానాల గదిలో రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్‌ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. భార్యను చంపేసి భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News