Monday, May 12, 2025

దేశంలో కొత్తగా 5357 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోన కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో 5357 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేలు 814కు చేరుకున్నాయి. శనివారం కూడా 6155 కరోనా కేసులు నమోదవ్వడంతో పాటు 11 మంది చనిపోయారు. కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బిబి 1.16 కారణమని శ్రాస్తవేత్తలు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభ్వుతాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News