Friday, May 17, 2024

ప్రకృతి ఆరాధకకులకు, వీక్షకులకు కనువిందు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రకృతి ఆరాధనతో పాటు పక్షుల కిలకిలరావాలను వీకెండ్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన కెమెరాలో బంధిస్తారు. ప్రకృతిని ప్రేమించాలి.. పక్షి జాతులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతూ ఉంటారు. ప్రధానంగా వలస పక్షుల విన్యాసాలు అబ్బుర పరుస్తుంటాయి.

A treat for nature lovers and watchersఅలాంటి దృశ్యాలను ఆయన కెమెరాలో బంధిస్తూ అందుకు సంబంధించిన ఇమేజ్‌లను తన ట్విట్టర్‌లో పొందుపరుస్తారు. ‘హ్యాపీ సండే’ పేరిట వారాంతంలో ఆయన ప్రకృతిని ఆరాధిస్తూ అరుదైన పక్షుల చిత్రాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తారు. ‘నా ఫోటోగ్రఫీ’ పేరిట ఆయన తీసే అరుదైన.. అందునా వలస పక్షుల ఆగమన చిత్రాలను ఆయన తన కెమెరాలో బంధిస్తూ ప్రకృతి, జంతు ప్రేమికులకు ఆహ్లాదం, అంతులేని అనుభూతిని కలిగిస్తారు. అదే విధంగా ప్రకృతి ఆరాధకులకు, వీక్షకులకు కనువిందు చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News