Thursday, August 21, 2025

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. దీంతో టైంస్లాట్‌ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల పడుతుండగా, టోకెన్ రహిత భక్తులకు 18 గంటల సమయం పడుతోంది.

కాగా, నిన్న(శుక్రవారం) శ్రీవారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 33,860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3.31 కోట్ల ఆదాయం వచ్చినట్టు టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News