Sunday, May 11, 2025

మదనపల్లి-బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం.. 30మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం మదనపల్లి-బెంగళూరు హైవేపై ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మందికి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News