Thursday, May 2, 2024

పొడిచిన చేతులతోనే దండం పెట్టే వ్యక్తి బాబు: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ అంటేనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఎన్‌ఆర్ శతజయంతోత్సవం సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు ప్రజల గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్‌టిఆర్ అని ప్రశంసించారు. దేశంలో రాజకీయ పార్టీలకు సింహాస్వప్నం ఎన్‌టిఆర్ అని కొనియాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పెట్టిన నాయకుడు ఎన్‌టిఆర్ అని మెచ్చుకున్నారు. అవసరమైనప్పుడు వాడుకుని తరువాత వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు. పొడిచిన చేతులతోనే దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

Also Read: పత్తిపై ప్రత్యేక వ్యూహం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News