Tuesday, May 7, 2024

సర్వీస్ కమీషన్ బోర్డును పునరుద్ధరించాలి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ యువతకు తగిన న్యాయం జరిగేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్‌కమీషన్ బోర్డును పునరుద్ద రించాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. సర్వర్ల హ్యకింగ్ , ప్రశ్నాపత్రాల సెల్లింగ్ మాస్‌కాపీయింగ్ వంటి వాటికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. ఏళ్ల తరబడి పరిక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు సర్వీస్‌కమీషన్ తీరు పట్ల తగిన నమ్మకం పెంచాలన్నారు. లక్షలాది యువత ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా కాపాడాలని కోరుతు ఈ మేరకు మంగళవారం నాడు షర్మిల రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News