Friday, May 3, 2024

అమిత్ షా, నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమిత్ షా, జెపి నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటి ? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో మమత, స్టాలిన్, నీతీశ్ కూడా మోడీ, అమిత్ షాను కలిశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ బిజెపి కాదన్నారు. కెసిఆర్ మాదిరిగా రాష్ట్ర ప్రమోజనాలను తాకట్టు పేట్టే పార్టీ బిజెపి కాదని ఆయన వెల్లడించారు. టిడిపి, బిజెపి పొత్తు ఊహాగానాలేనని బండి సంజయ్ వెల్లడించారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News