Tuesday, May 21, 2024

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

కీసర : మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరుగా జరిగిన రెండు సంఘటలలో ఇద్దరు దంపతులు, మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహ్మద్ గూడ రాజీవ్ గృహ కల్ప కాలనీలో జరిగిన సంఘటనలో కుటుంబ సమస్యలతో దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా పోలీసులు గుర్తించారు.

కుందన్ పల్లిలో గ్రామంలో జరిగిన మరో సంఘటనలో ఆర్థిక ఇబ్బందులతో కడమంచి నర్సిహ(38) ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు రెండు సంఘటలలో మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News