Tuesday, September 16, 2025

కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్‌లో కుప్వారా జిల్లా డొబనార్ మషల్ ప్రాంతంలో మంగళవారం వీరిని మట్టుబెట్టినట్టు కశ్మీర్ పోలీస్‌లు ప్రకటించారు. ఇంకా మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో స్కూళ్లను మూసివేశారు. ఈ నెల మొదట్లో రాజౌరి జిల్లాలో ఓ ఉగ్రవాదిని బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News