Wednesday, September 17, 2025

షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

బాధితులు వనపర్తి జిల్లా పెబ్బేరు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేసుకున్న షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అదిక వేగం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News