Friday, May 10, 2024

జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌కు బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు. ఈటల రాజేందర్‌కు మిథున్ రెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు. జితేందర్ రెడ్డి ఈటెల భేటీ అయ్యారు. ముగ్గురు నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఈటలకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

Also Read: కోకాపేట్‌లో సెమీకండక్టర్ డిజైన్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News