Tuesday, May 21, 2024

నా ట్వీట్‌కు వివరణ ఇవ్వను… ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం: జితేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతా కలిసి పని చేసే సంప్రదాయం బిజెపిలో ఉందని బిజెపి నేత జితేందర్ రెడ్డి తెలిపారు. బిజెపి నేత జితెందర్ రెడ్డితో ఈటల రాజేందర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడారు. తన ట్వీట్‌కు వివరణ ఇవ్వనని, ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండన్నారు. ఈటలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదన్నారు. జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ వైరల్ కావడంతో బిజెపిలో అలజడి లేపిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News