Monday, May 20, 2024

ఇడి అధికారుల ఎదుట హాజరైన టీనా అంబానీ

- Advertisement -
- Advertisement -

ముంబై: విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) కేసుకు సంబంధించి రిలయల్స్ ఎడిఎ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి అనిల్ అంబానీ సోమవారం ఇడి అధికారుల ఎదుట హాజరై వాంగ్ల్మూలం ఇచ్చారు.

మంగళవారం టీనా అంబానీ వాంగ్మూలాన్ని ఇడి అధికారులు నమోదు చేశారు. అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ ఈ వారంలో మరోసారి ఇడి ఎదుట హాజరుకావలసి ఉంటుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధిచి వివిధ సెక్షన్ల కింద అనిల్ అంబానీపై తాజాగా కేసు మోదైంది. సోమవారం ఉదయం 10 గంటలకు దక్షిణ ముంబైలోని ఇడి కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరైన అనిల్ సాయంత్రం 5 గంటల వరకు విచారణను ఎదుర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News