Sunday, August 10, 2025

ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి చెందారు. బుధవారం బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రస్తుత విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్రానికి (ఎపి, తెలంగాణ,కర్ణాటక ప్రాంతాలు) సంఘటన మంత్రిగా కేశవ్ హెగ్డే సేవలందించారు. హుబ్లీ సమీపంలో గల శిరసి గ్రామానికి చెందిన కేశవ్ హెగ్డే అంత్యక్రియలను వారి స్వగ్రామంలో గురువారం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News