Sunday, May 12, 2024

గాంధీభవన్‌లో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారికి బోనాలు సమర్పించినట్టు సునీతా రావు తెలిపారు. పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూరగాయలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News