Tuesday, May 14, 2024

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియాలోని హాంప్టన్‌లోని డాగ్‌వుడ్ లేక్స్ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు హాంప్టన్ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ పేర్కొన్నారు. సిిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందుతుడిని ఆండ్రీ లాంగ్‌మోర్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News