Sunday, May 25, 2025

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. సాయన్న లేని లోటు పూడ్చలేనిదని, కంటోన్మెంటును జీహెచ్ఎంసిలో కలపాలని సాయన్న పరితపించేవారని సిఎం గుర్తు చేశారు.

అనంతరం సభలో సాయన్న సంతాప తీర్మానాన్ని సిఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభ సాయన్నకు నివాళులర్పించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News