Wednesday, May 15, 2024

ట్యాంక్‌బండ్ మీదుగా గద్దర్ అంతిమయాత్ర…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ప్రజా గొంతుక, యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర ట్యాంక్‌బండ్ మీదుగా సాగనుంది. అపోలో స్పెక్ట్రా అమీర్‌పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయం ఎల్బీస్టేడియానికి తరలించారు. ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ భూదేవినగర్‌లోని ఆయన నివాసం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. తర్వాత ఆయన నివాసం వద్ద కొద్దిసేపు పార్థివదేహం ఉంచనున్నారు. అనంతరం 2 గంటలకు గద్దర్ స్దాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుంటు సభ్యులు తెలిపారు.

Also Read: ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News