Monday, May 20, 2024

విశాఖలో విషాదం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతోపాటు ఆత్మహత్య చేసుకుంది. తను ఉంటున్న అపార్టుమెంట్ నీటిసంపులో ఇద్దరు పిల్లలతో సహా దూకింది. దీంతో పిల్లలతోపాటు తల్లి కూడా మృతి చెందింది.

సమాచారం అందుకున్న విశాఖ ఎయిర్ పోర్టు పోలీసులు వెంటనే సంఘటానాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. మృతులను అపార్టుమెంట్ వాచ్ మెన్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News