Monday, May 27, 2024

లారీని ఢీకొట్టిన ఆటో: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లంద వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తేనె విక్రయించేందుకు ఆరుగురు కూలీలు ఆటోలో వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో లారీ నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: ప్రేమ విఫలం… సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News