Monday, September 15, 2025

బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గించింది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వంపై టిపిసిసి అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ఫైర్ అయ్యారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ మహిళలకు పెద్ద పీట వేయలేదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ జాబితాలో మహిళలకు తక్కువ సీట్లు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. గిరిజన మహిళపై పోలీసుల దాడి, మీర్ పేటలో 16 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని, కులవృత్తులను ప్రోత్సాహాం కరువవుతుందని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News