Tuesday, September 16, 2025

ఆసియాకప్‌ 2023: జట్టు ఎంపికపై విమర్శలు వద్దు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆసియాకప్‌లో పాల్గొనే టీమిండియా ఎంపికపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన ఈ టోర్నమెంట్‌లో రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ వంటి సీనియర్ స్పిన్నర్లకు చోటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమ అభిమాన క్రికెటర్లను జాతీయ జట్టుకు దూరంగా ఉంచడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. దీనిపై సీనియర్ బౌలర్ అశ్విన్ స్పందించాడు. అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. జట్టు ఎంపికలో అందరికి న్యాయం జరగడం చాలా కష్టమైన అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News