Wednesday, May 15, 2024

మానవత్వం చాటుకున్న పోలీస్ అధికారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు పోలీస్ అధికారి. ఈ సంఘటన బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. నార్త్‌జోన్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి అటుగా వెళ్తున్నారు. అదేసమయంలో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడిపోయాడు.

ఇది గమనించిన అదనపు పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వెంటనే వాహనం దిగి అతడి వద్దకు వెళ్లి సిపిఆర్ చేశాడు. దీంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. తర్వాత ఆ వ్యక్తిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారైనా కూడా హోదాను చూడకుండా సిపిఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు నిలిపిన పోలీస్ అధికారిని పలువురు అభినిందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News