Tuesday, June 17, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తులు రద్ధీ కొనసాగుతోంది.  తిరుమలలో టోకెనుల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి టిబిసి వరకు భక్తులు వేచి ఉన్నారు. గురువారం ఒక్క రోజే శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.6 కోట్లుగా ఉందని వెల్లడించారు.

Also Read: గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News