Monday, July 14, 2025

ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌పై వైసిపి నేతల దాడి అవాస్తవం: డిఎస్‌పి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌పై వైసిపి నేతల దాడి అవాస్తవమని డిఎస్‌పి ఆదినారాయణ తెలిపారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, అతడి బంధువుపై దాడి చేశారని, దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకవచ్చారని, మాజీ సర్పంచ్ వైసిపి నేత కావడంతో గ్రామస్థులు వచ్చారని తెలిపారు. గ్రామస్థులకు నచ్చచెప్పేందుకు ఎస్‌ఐ ప్రయత్నించారని, సిఐ, తాను స్టేషన్‌కు వెళ్లామని, అక్కడ దాడి ఏమీ జరగలేదన్నారు.

Also Read: సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News