Saturday, May 11, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న నేర్జాంపల్లె గంగారాం(21) మంగళవారం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రిపుల్ ఐటీకి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News