Tuesday, August 26, 2025

తనిఖీలలో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో భారీగా బంగారం, డబ్బు పట్టుబడింది. బంజారాహిల్స్‌లో రూ.3.35 కోట్ల నగదును పట్టుకున్నారు. బషీర్‌బాగ్‌లో ఏడు కిలోల బంగారం, 257 కేజీల వెండిని సీజ్ చేశారు. ఫతేనగర్‌లో రూ.25 లక్షలు, సరూర్‌నగర్‌లో రూ.7 లక్షలు, చైతన్యపురిలో రూ.30 లక్షలు, దోమలగూడలో ఆరు లక్షల రూపాయలు సీజ్ చేశారు. నగదు తీసుకెళ్లేటప్పుడు సరైన పత్రాలు చూపాలని ఉన్నతాధికారులు సూచించారు. సరహద్దు చెక్‌పోస్టుల్లో సైత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News