Tuesday, September 16, 2025

బతుకమ్మ చీరలపై సిఎం కెసిఆర్ కామెంట్స్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని ఆయన వెల్లడించారు. ఇప్పుడు అప్పర్ మానేరు సజీవ జీవధారగా మారిందన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి ఎంతో చలించిపోయానని తెలిపారు. చందాలు సేకరించి చేనేత కార్మికులకు సహాయం చేశామన్నారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించామన్నారు. బతుకమ్మ చీరలు… కేవలం చేనేత కార్మికులను ఆదుకునేందుకే.. చీర నచ్చకపోతే తీసుకోవద్దు.. అంతే కానీ రాజకీయం చేయొద్దు అని సిఎం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News