Thursday, May 9, 2024

ఆసిఫ్‌నగర్‌లో భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో తరలిస్తున్న భారీ నగదును ఆసిఫ్‌నగర్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 1,78,30,000లు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, షేక్‌పేట, గుల్షాన్ కాలనీకి చెందిన మహ్మద్ షానవాజుద్దిన్ ఎన్‌ఆర్‌ఐ, మహ్మద్ షాబుద్దిన్ ఇద్దరు సోదరులు. ఇద్దరు సోదరులు రెండు కార్లలో నగదు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌నగర్ పోలీసులు గుడిమల్కాపూర్‌లోని సాయిబాబా టెంపుల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా వస్తున్న రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా నగదు లభించింది. నగదుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News