Wednesday, May 15, 2024

మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి కెటిఆర్ సమక్షంలో మాజీ ఎంఎల్‌ఎ ఎర్ర శేఖర్ బిఆర్‌ఎస్‌లో చేరారు. జడ్చర్ల నుంచి మూడుసార్లు ఎర్రశేఖర్ ఎంఎల్‌ఎగా గెలిచారు. శేఖర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఎర్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బిఆర్ఎస్ కార్యర్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News