Thursday, May 16, 2024

కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్ గాంధీ..

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ టూర్ నేపథ్యంలో మేడిగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం ఉదయం మేడిగడ్డకు చేరుకున్న రాహుల్.. ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. రాహుల్ రాకతో బ్యారేజీ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. రాహుల్ గాంధీతోపాటు ఒకరిద్దరు నేతలను మాత్రమే ప్రాజెక్టు దగ్గరకు అనుతించారు.

రాహుల్ రావడంతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన భారీ క్రేడ్లను తోసుకుంటూ ప్రజలు మేడిగడ్డ వైపు తరలివస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మేడిగడ్డ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News