Thursday, June 19, 2025

పురందేశ్వరి అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే: విజయసాయి రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపి విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. కులం, కుటుంబం చుట్టే పురందేశ్వరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ప్రతీ కదలిక ఆలోచనంతా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని చురకలంటించారు. అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే అని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవని స్వార్థం తప్ప, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News