Thursday, June 5, 2025

నామినేషన్ వేసిన కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం నామినేషన్లు వేశారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసీఆర్ ఉదయం 11.06 గంటలకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్డీఓ బన్సీలాల్ కు అందజేశారు. మరికాసేపట్లో ఆయన నేరుగా కామారెడ్డికి వెళ్లి నామినేషన్ వేస్తారు.

తర్వాత అక్కడే జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ వేశారు. కాసేపట్లో సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ఆయన విలేఖరులతో మాట్లాడతారు. ఇక, సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News