Saturday, June 1, 2024

ప్రచారంలో కాస్త బ్రేక్

- Advertisement -
- Advertisement -

ములుగు: ములుగు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతిని సీఎం కేసిఆర్ అభ్యర్ధిగా ప్రకటించినప్పటినుండి ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నిత్యం ప్రజలతో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి గోవిందరావుపేట మండలం పస్రాలో ప్రచారం ముగించుకుని వస్తున్న తరుణంలో గోవిందరావు పేట వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఇడ్లీ బండి దగ్గర ఆగి కాస్త బ్రేక్ తీసుకుని ఇడ్లీ ఆరగించింది. తన తల్లిదండ్రులు ఉద్యమంలో ఉన్న సమయంలో తాడిత, పీడిత ప్రజలకోసం అహర్నిశలు శ్రమించగా, వారి బిడ్డ బడే నాగజ్యోతి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే బరిలో ఉండి ప్రచారం నిర్వహిస్తూ ఇడ్లీ బండి వద్ద టిఫిన్ చేస్తూ కాస్త ఉపశమనం పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News